టాలీవుడ్లో మే 30న విడుదల కాబోతున్న భైరవం సినిమా ఇప్పుడు వివాదాల తుపానులో చిక్కుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన ఈ సినిమా తమిళ బ్లాక్బస్టర్ గరుడన్ కి రీమేక్. ట్రైలర్తో మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమాపై ఇప్పుడు సోషల్ మీడియాలో బాయ్కాట్ ట్రెండ్ షురూ అయింది.
మొదట మాజీ సీఎం జగన్ అభిమానులు డైరెక్టర్ విజయ్ కనకమేడల చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాయ్కాట్ చేయాలంటూ పిలుపు ఇచ్చారు. అయితే, అద్భుతంగా సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కారణం – 2011లో చిరంజీవి, రామ్ చరణ్లపై ఉన్న ఓ మార్ఫింగ్ పోస్టును విజయ్ పోస్ట్ చేశాడన్న ఆరోపణలు.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ విజయ్ కనకమేడల ఎమోషనల్గా స్పందించారు. తన సోషల్ మీడియా హ్యాక్ అయి ఉండొచ్చని, అయినా బాధ్యత తీసుకుంటున్నానని పేర్కొన్నారు. మెగా ఫ్యామిలీ హీరోలతో తన అనుబంధాన్ని గుర్తు చేస్తూ, తనను తాను ‘మీలో ఒకడిని’గా పేర్కొంటూ క్షమాపణలు చెప్పారు.
ఇక దీనితో మెగా ఫ్యాన్స్ సంతృప్తి పడతారా..? లేక సినిమా రిలీజ్కు ముందు మరిన్ని ట్విస్టులు చూస్తామా అన్నది చూడాల్సిందే.