News June 27, 2024

TG: సీఎం రేవంత్‌రెడ్డి రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. హనుమకొండ ఐడీఓసీ కార్యాలయంలో జరిగే వనమహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఉన్నతాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు, మామునూరు ఎయిర్‌పోర్ట్, కాళోజీ కళాక్షేత్రం తదితర అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత కాకతీయ మెగా జౌళి పార్కు, నయీంనగర్ నాలా తదితర ప్రాంతాలను సందర్శించనున్నారు.