రామ్ చరణ్ (Ram charan) గేమ్ ఛేంజర్ (Game changer) సినిమా ఎప్పుడు పూర్తవుతుంది అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. దీనిపై మెగాభిమానులు సీరియస్ గా ఉన్నారు. ఈ ప్రశ్నకు తాజా ఇంటర్వ్యూలో సమాధానం చెప్పారు దర్శకుడు శంకర్ (Director shanakr). గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఇంకా 10 నుంచి 15 రోజులు మాత్రమే చేయాల్సిఉందని చెప్పారు. భారతీయుడు 2 రిలీజ్ అయ్యాక గేమ్ ఛేంజర్ బ్యాలెన్స్ ఫినిష్ చేస్తామని, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేసి రిలీజ్ కు తీసుకొస్తామని శంకర్ చెప్పాడు.

ఈ ఏడాది చివరలో గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తున్నా…అదంతా శంకర్ చేతుల్లోనే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ తీసుకుంటే ఈ ఏడాది గేమ్ ఛేంజర్ రానట్లే అనుకోవాలి. ఈ సినిమాను దిల్ రాజు (Dilraju) నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.