News June 27, 2024

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సరికొత్త రికార్డులను సృష్టించాయి. సెన్సెక్స్ 79వేల మార్క్ తాకి ఆల్ టైమ్ హై నమోదు చేసింది. మరోవైపు నిఫ్టీ సైతం 23,974 చేరి సరికొత్త గరిష్ఠాలను తాకింది. అయితే కోల్ ఇండియా, LT, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్ వంటి బడా షేర్లు నష్టాలను నమోదు చేయడంతో మార్కెట్లు ఒడుదొడుకులకు గురవుతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 73 పాయింట్ల లాభంతో 78,751 వద్ద ట్రేడవుతోంది.