News June 27, 2024

మద్దిలపాలెం వి.ఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో రేపు, ఎల్లుండి(ఈనెల 28,29) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఐ.విజయ్ బాబు తెలిపారు. వైజాగ్ టెక్ మహీంద్రాలో 328 బీపీఓ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. డిగ్రీ పాస్/ఫెయిలైన నిరుద్యోగ అభ్యర్థులు అర్హులని వెల్లడించారు. ఆసక్తి గలవారు ఆరోజు ఉదయం 9:30 గంటలకు సర్టిఫికేట్స్, రెజ్యూమ్‌తో హాజరవ్వాలని సూచించారు.