ఒక్కోసారి అనిపిస్తుంది కదా.. ట్రెండింగ్ అవుతున్న వార్తలన్నీ నిజమైతే ఎంత బాగున్నో అని..! ఎందుకంటే అలాంటి వార్తలే కదా అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంటాయి. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో కొన్ని క్రేజీ గాసిప్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అవి చూసిన ఫ్యాన్స్.. ఇవే నిజమైతే బాగుండు అంటున్నారు. మరి అవేంటో చూద్దామా..?
కొన్నిసార్లు సోషల్ మీడియా న్యూస్ భలే కిక్ ఇస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇలాంటి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. అందులో ట్విట్టర్ను షేక్ చేస్తున్న న్యూస్ రజినీకాంత్, సల్మాన్ ఖాన్ మల్టీస్టారర్.
దానికి దర్శకుడెవరో కాదు.. అట్లీ. అల్లు అర్జున్ సినిమా ఆగిపోయిన తర్వాత.. ఈ దర్శకుడు సల్మాన్, రజినీతో సినిమా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. నిజంగా రజినీ, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో అట్లీ సినిమా కానీ వర్కవుట్ అయిందంటే.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.
అలాంటి మరో క్రేజీ గాసిప్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుక్, సమంత జంటగా ఓ సినిమా రానుందని ప్రచారం జరగడం. అయితే ఇది నిజం కాదని.. తన నెక్ట్స్ సినిమాలో ఇంకా ఎవర్నీ ఫైనల్ చేయలేదని చెప్పారు రాజ్ కుమార్ హిరాణి.
సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తున్న మరో న్యూస్ నివేదా థామస్ పెళ్లి. నిప్పు లేని పొగ రాదు కదా.. ఈమె తన ట్విట్టర్లో లవ్ సింబల్తో ఓ పోస్ట్ పెట్టారు. దాంతో ఈమె పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. ఆ ట్వీట్ అర్థం పెళ్లేనా లేదంటే వేరేనా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇలా ట్విట్టర్ అంతా క్రేజీ గాసిప్స్తో షేక్ అయిపోతుందిప్పుడు.