News June 28, 2024
సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత ఓపెనర్లు సెంచరీలతో కదం తొక్కారు. షఫాలీ వర్మ(117*), మంధాన(111*) సఫారీ బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు. దీంతో 45 ఓవర్లకు భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 230 రన్స్ చేసింది. వన్డే సిరీస్లోనూ మంధాన రెండు సెంచరీలతో పాటు మూడో వన్డేలో 90 రన్స్ బాదిన విషయం తెలిసిందే.