News June 28, 2024
టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు టీమ్ ఇండియా చేరుకోవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించారు. టోర్నీ ఆసాంతం ఇద్దరూ జట్టును ముందుండి నడిపించారు. రోహిత్ ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడి 248 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నారు. అలాగే పాండ్య అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో రాణించారు. 139 రన్స్తో పాటు 8 వికెట్లు తీసి జట్టు విజయాలకు కృషి చేశారు.