News June 28, 2024

ఈ ఏడాది అవినీతి కేసుల నమోదులో పాలమూరు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అత్యధికంగా అవినీతి కేసులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. 2024 జనవరి నుంచి ఈ నెల 26 వరకు మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. పోలీసు శాఖకు సంబంధించి మూడు, రెవెన్యూ, విద్యుత్ శాఖలవి రెండు చొప్పున, ఎక్సైజ్, మున్సిపల్ శాఖలవి ఒకటి చొప్పున కేసులు నమోదు అయ్యాయి.