బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ సీనియర్ యాక్టర్స్‏లో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇటీవల కొన్నాళ్లుగా అతడి వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నవాజ్ పై ఆయన భార్య అలియా సంచలన ఆరోపణలు చేసింది. అత్తింట్లోకి రానివ్వడం లేదని.. తనను వేధిస్తున్నారంటూ భర్తపై తీవ్ర ఆరోపణలు చేస్తూ రోడ్డుపై నానా హంగామా సృష్టించింది. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు తమ కూతురు భవిష్యత్తు కోసం విడిపోవాలనే ఆలోచనను విరమించుకుని మళ్లీ కలిసిపోయారు. ఇప్పుడిప్పుడే నవాజ్ తన భార్య, కూతురితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి చేసుకోవడమే దండగా.. అసలు ప్రేమే ఉండదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

“నేను ఏం చెప్పినా ప్రజలు తప్పుగా తీసుకుంటారు. కానీ ఇది నిజమే మనుషులు అసలు పెళ్లి చేసుకోవద్దు. ఒకరితో మరొకరు ప్రేమలో ఉండే వారిద్దరు బంధం మరింత సంతోషంగా ఉండాలంటే అసలు పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే వైవాహిక బంధంలోకి అడుగుపెడితే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. పెళ్లి తర్వాత మనుషులు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఊహించుకోవడం స్టార్ట్ చేస్తారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. పెళ్లి చేసుకోకపోతేనే ఒకరినొకరు ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ పెళ్లి తర్వాత ప్రేమే ఉండదు. పిల్లలు పుట్టినప్పుడు నుంచి మరింత తగ్గుతుంది. ఎవరినైనా ప్రేమిస్తూ ఉండాలనుకుంటే మీరు పెళ్లి చేసుకోవడం దండగ. ప్రేమ, భార్య మనల్ని సంతోషపెడుతుందని అనుకుంటాం. కానీ మన పని మాత్రమే మనల్ని సంతోషపెడుతుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నవాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

భార్యతో వాగ్వాదం తరువాత, నవాజుద్దీన్ చివరకు మార్చి నెలలో ఆమెతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాడు. కొన్నేళ్ల క్రితమే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆలియా గతంలో పేర్కొంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి 14వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఓ ఇంటర్వ్యూలో ఇద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని స్పష్టం చేసింది అలియా. మూడో వ్యక్తి వల్లే తమ జీవితంలో సమస్యలు వచ్చాయని.. ఇప్పుడు అవి పూర్తిగా తొలగి పిల్లల కోసం తిరిగి కలిసిపోయామని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.