News June 29, 2024

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఉన్న కవిత త్వరలో అప్రూవర్‌గా మారబోతున్నారని మహబూబ్‌నగర్ MLA యెన్నం శ్రీనివాస్‌రెడ్డి జోస్యం చెప్పారు. అందుకే కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు బావ బామ్మర్ది మినహా BRSలో ఎవరూ మిగలరన్నారు. రూ.7లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు.