News June 28, 2024

షాద్‌నగర్ పరిధిలోని పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల వివరాలు ఇలా ఉన్నాయి. యూపీకి చెందిన నితీష్ కుమార్(22), రామ్ సెత్(24), బీహార్‌కు చెందిన రాంప్రకాష్(31), చిత్తరంజన్(31), ఒడిషాకు చెందిన రతికాంత్ అనే కార్మికులు మృతి చెందినట్లు ఆర్డీవో మాధవరావు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.