News June 29, 2024
నటి వరలక్ష్మి శరత్ కుమార్, నికోలయ్ సచ్దేవ్ల వివాహం జులై 2న థాయ్లాండ్లో జరగనుంది. ఈక్రమంలో వరలక్ష్మి పలువురు సెలబ్రిటీలను స్వయంగా కలిసి చెన్నైలో జరిగే రిసెప్షన్కి ఆహ్వానిస్తున్నారు. తాజాగా తండ్రి శరత్ కుమార్, రాధికతోపాటు కాబోయే దంపతులు ప్రధాని మోదీని కలిశారు. రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డు అందించి ఆయనను ఆహ్వానించారు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ తమకు టైమ్ ఇచ్చినందుకు ఆమె మోదీకి ధన్యవాదాలు తెలిపారు.