జనగామ జిల్లాను ఆదర్శవంతమైన మహిళా శక్తి దిశగా నిలపాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేటులో మండలాల సీసీలు, ఏపీఎంలు, వీవోలకు మహిళా శక్తి పథకంపై కలెక్టర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలకు జీవనోపాధి కల్పించాలని వారిని మరింత ఎక్కువగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళాశక్తి పథకాన్ని ప్రారంభించిందన్నారు.