News June 29, 2024

కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహచారి, అదనపు నియంత్రణ అధికారి సౌజన్య శుక్రవారం విడుదల చేశారు. జులై 5, 8, 10, 12, 15, 18న ఉంటుందని తెలిపారు. పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు.