News June 29, 2024
జియోతో మొదలై ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు టారిఫ్లు పెంచడంతో యూజర్లకు రీఛార్జ్ భారంగా మారింది. యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకునేందుకే సంస్థలు టారిఫ్ను పెంచాయి. FY24 క్యూ4లో ఎయిర్టెల్ ARPU ₹209, జియో ₹181.7, Vi ₹146గా ఉంది. ఈ సగటు FY27కి ₹300కు పెంచుకోవాలని ఎయిర్టెల్ ఆశిస్తోంది. 5జీ సేవలను మానిటైజ్ చేసుకునేందుకు కూడా టారిఫ్లు పెంచుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.