News June 29, 2024

OU లీడర్ మోతిలాల్ నాయక్ నిరుద్యోగుల సమస్యలపై నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ నల్గొండ కేంద్ర గ్రంథాలయం నుంచి క్లాక్ టవర్ వరకు నిరుద్యోగులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రూప్ 2, 3లలో పోస్టులు పెంచి పరీక్షలను డిసెంబర్‌లో నిర్వహించాలని నినాదాలు చేశారు. DSC పోస్టుల పెంపుతో పాటు పరీక్షకు టైం ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ తక్షణమే స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.