నంద్యాల జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్.వెంకటరమణ ఆదేశించారు. స్థానిక వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మాతృ మరణాలపై నందికొట్కూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎర్రమఠం, టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాలపై సంబంధిత వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.