RRRకు జాతీయ హోదా, ఒకేసారి నిర్మించాలన్న నిర్ణయంతో పనులు వేగం కానున్నాయి. దీని ఉత్తర భాగం ఉమ్మడి మెదక్ జిల్లాలో 110KM మేర నిర్మాణం కానుంది. ఇది జగదేవపూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి వయా కంది వరకు నిర్మించనున్నారు. గజ్వేల్, తూప్రాన్, సంగారెడ్డి వద్ద హైవేలతో కలవనుంది. RRR కోసం భూములు కోల్పోయిన బాధితులు మళ్లీ నిర్వాసితులు కానున్నారు. దీంతో అలైన్మెంటు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.