News June 30, 2024

గిద్దలూరుకు చెందిన ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు నగర పంచాయితీ ఛైర్మన్ వెంకట సుబ్బయ్య ఆద్వర్యంలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్ రెడ్డి ఆదివారం వారికి తెలుగుదేశం పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన కౌన్సిలర్లలో నాగేశ్వరరావు, గరే సుబ్బారావు, మోడంపల్లె శ్రీరాములు, పెద్దవలి తదితరులు ఉన్నారు.