News June 30, 2024

క్రికెట్‌లో WC గెలవడం కన్నా మించింది ఏముంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల సాకారమైన వేళ ముగ్గురు భారత క్రికెటర్లు గుడ్ బై చెప్పారు. నిన్న రోహిత్, కోహ్లీ టీ20Iలకు వీడ్కోలు పలకగా తాజాగా ఆల్‌రౌండర్ జడేజా ఆ జాబితాలో చేరారు. వరల్డ్ కప్ గెలిచిన ఆనందం ఓ వైపు, అభిమాన ఆటగాళ్లు దూరమవుతున్నారని బాధలో మరో వైపు ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. టీ20ల్లో మీ వండర్స్ ఇక చూడలేమని కామెంట్లు చేస్తున్నారు.