News June 30, 2024

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో శనివారం చీనీకాయలు టన్నుకు గరిష్ఠంగా రూ.19వేలు, కనిష్ఠంగా రూ.8వేలు, సరాసరి రూ.12వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. శనివారం అనంతపురం మార్కెట్‌కు మొత్తంగా 305 టన్నుల చీనీకాయలు వచ్చాయని జయలక్ష్మి వెల్లడించారు. చీనీకాయలు ధరలు క్రమేణా తగ్గుతుండడంతో రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.