News June 30, 2024

ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా భారత జట్టుకు అద్భుతమైన ప్రదర్శన చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. టీ20Iల్లో ఏళ్లుగా అద్భుత ప్రదర్శన చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. స్పిన్ బౌలింగ్, స్టైలిష్ స్ట్రోక్ ప్లే, ఫీల్డింగ్‌తో క్రికెట్ ప్రేక్షకుల మన్ననలు పొందారని ట్వీట్ చేశారు. భవిష్యత్తు కార్యాచరణకు బెస్ట్ విషెస్ తెలిపారు. తాజాగా జడేజా టీ20Iలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.