News June 29, 2024

రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం నుంచి విడిపోయి ముంపు గ్రామాల పేరుతో ఆంధ్రలో విలీనమైన 5 పంచాయతీలు తిరిగి భద్రాచలంలో కలపాల్సిందే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కన్నాయిగూడెం, పిచ్చుకులపాడు , ఎటపాక, పురుషోత్తమ పట్నం, గుండాల పంచాయతీలు ముంపునకు గురి కావన్నారు. అయినా పోలవరం ముంపు పేరుతో ఆంధ్రాలో విలీనం చేశారని, ఆ పంచాయతీలను ఎప్పటికైనా భద్రాచలంలో కలపాల్సిందేనని స్పష్టం చేశారు.