News June 30, 2024

రాయలసీమ విశ్వవిద్యాలయంలో పీజీ-4వ సెమిస్టర్ పరీక్షలను జులై 1 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ఆచార్య వెంకటసుందరానంద్ పుచ్చ తెలిపారు. వర్సిటీ కళాశాలతో పాటు మరో ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రెగ్యులర్ 468 మంది, సప్లిమెంటరీ 103 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.