చిత్తూరు జిల్లాలో మొత్తం 2,71,696 మందికి రూ.181కోట్లు పెన్షన్ల కింద జూలై 1న పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వృద్ధాప్య పెన్షన్ కింద 1,45,035 మందికి రూ.101.52 కోట్లు, నేతన్న పెన్షన్ 2,572 మందికి రూ.1.80 కోట్లు, వితంతు పెన్షన్ 59,993 మందికి రూ.42 కోట్లు, వికలాంగుల పెన్షన్ కింద 35,803 మందికి రూ.21.48 కోట్లు ఇవ్వనునట్లు తెలిపారు.