News June 29, 2024

నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఆర్మూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన బోర్గాం (కె) మూల మలుపు వద్ద రెండు పాడైన సిమెంట్ పైపులు (గూణలు) ఉన్నాయి. వాటిని ఇల్లుగా మార్చుకొని ఓ వృద్ధురాలు జీవిస్తోంది. భర్త చనిపోయారని, నా అనే వారు ఎవరు లేరని, ఉండటానికి ఇల్లు సైతం లేదని ఆమె పేర్కొంది. దాతలు ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ జీవిస్తోంది. ప్రభుత్వం ఇలాంటి వారిని గుర్తించి ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.