News June 30, 2024

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాటలోనే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ T20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ‘కృతజ్ఞతతో నిండిన హృదయంతో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఇన్నేళ్లూ గర్వంతో దూసుకెళ్లే గుర్రంలా నా దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చా. ఇకపై ఇతర ఫార్మాట్లలో నా జర్నీ కొనసాగిస్తా. T20WC గెలవడమనే నా కల నిజమైంది. ఇది నా కెరీర్‌లో అత్యున్నత ఘనత’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.