చింతపల్లి మండలంలోని కొత్తబంద గ్రామానికి సరైన రహదారి లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామంలోని బడి ఈడు పిల్లలు పక్క గ్రామమైన పొట్టిబంద ఎంపీపీ పాఠశాలలో చదువుతున్నారు. అయితే రహదారి సౌకర్యం లేకపోవడం, రెండు గ్రామాల మధ్యలో కొండవాగు ఉండడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్థులు కలిసి వాగుపై కర్రలతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు.