News June 30, 2024

AP: అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. డయాఫ్రం వాల్, స్పిల్ వే వంటి ప్రధాన నిర్మాణాలతో పాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పరిశీలించారు. వారు 4 రోజులు పాటు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటిస్తారు. ఒక్కోరోజు ఒక్కో విభాగాన్ని పరిశీలించి ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదికను బట్టే పనులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.