News June 30, 2024

మనస్తాపంతో ఉరేసుకొని 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై డి.సుబాష్ వివరాల ప్రకారం.. లింగంపల్లిలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న గణేశ్‌ కూతురు రుకిత(12) ఏడో తరగతి చదువుతోంది. కామారెడ్డిలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి తీసుకువెళ్తామని చెప్పి తీసుకెళ్లలేదు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని రుకిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.