తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ నిధి అగర్వాల్. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన హిట్టు రావడం లేదు. తొలి సినిమాతోనే కుర్రకారును పడగొట్టిన నిధికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.
ఈ అమ్మడు నటిగా కెరీర్ స్టార్ట్ చేసి ఏడేళ్లు దాటిపోయింది. అయినా ఇప్పటివరకు కేవలం ఏడు సినిమాల్లోనే నటించింది. కానీ ఒక్క మూవీ కూడా సూపర్ హిట్ కాలేకపోయింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించి అలరించింది.
2018లో సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ బ్యూటీ డిజాస్టర్ కావడంతో నిధికి అంతగా గుర్తింపు రాలేదు. తర్వాత మిస్టర్ మజ్నుతో మరోసారి పలకరించినా అంతగా క్రేజ్ మాత్రం రాలేదు. ఇక ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఈ మూవీ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కానీ ఊహించినంతగా అవకాశాలు మాత్రం రాలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. కానీ ఈ సినిమా రోజు రోజుకు మరింత ఆలస్యమవుతుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. నెట్టింట యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ఇప్పుడు బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టింది. నిషా చూపులతో చంపేస్తుంది ఈ వయ్యారి.