News June 30, 2024

AP: అంతర్జాతీయ నిపుణుల బృందం నేడు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రానుంది. అమెరికా, కెనడా నుంచి నలుగురు నిపుణులు 4 రోజుల పాటు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాలపై ఫోకస్ చేయనున్నారు. అక్కడి నిర్మాణాల్లో ఎదురయ్యే సవాళ్లపై అధ్యయనం చేస్తారు. ఆపై జలసంఘం నిపుణులు, అధికారులతో రెండ్రోజుల పాటు చర్చించి నివేదికను అందిస్తారు.