News July 1, 2024
ప్రతిష్ఠాత్మక టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సారి ఫేవరెట్గా సెర్బియా ప్లేయర్ జకోవిచ్ ఉన్నారు. ఆయనకు టాప్ సీడ్ సినర్, మూడో ర్యాంకర్ అల్కరాస్ నుంచి పోటీ నెలకొంది. మరోవైపు గాయం కారణంగా నాదల్ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. మహిళల సింగిల్స్లో స్వైటెక్, సబలెంక, సకారి టైటిల్ రేసులో ఉన్నారు. భారత్ ప్లేయర్ సుమిత్ తొలి రౌండ్లో సెర్బియా ఆటగాడు కెక్మనోవిచ్తో తలపడనున్నారు.