అవార్డ్ సినిమా, కమర్షియల్ సినిమా అంటూ సినిమాను విడదీసి చెబుతుంటారు గానీ మంచి సినిమాకు బాక్సాఫీస్ రివార్డ్స్ తో పాటు అవార్డ్స్ కూడా దక్కుతుంటాయి. ఆనంద్ దేవరకొండ (Anand devarakonda), వైష్ణవి చైతన్య (Vaishanavi chaitanya), విరాజ్ అశ్విన్ (viraj ashwin) హీరో హీరోయిన్లుగా నటించిన బేబి (Baby) సినిమా ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తోంది. లాస్ట్ ఇయర్ రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల రూపాయల గ్రాసర్ గా నిలవడమే గాదు పలు ప్రెస్టీజియస్ అవార్డ్స్ గెల్చుకుంటోంది. గామా లో బెస్ట్ యాక్టర్ గా ఆనంద్ దేవరకొండ పురస్కారం అందుకున్నారు. బెస్ట్ ప్రొడ్యూసర్ గా ఎస్ కేన్ దాసరి ఫిలిం అవార్డ్ గెల్చుకున్నారు.

ఇప్పుడు కళావేదిక ఎన్టీఆర్ ఫి‌లిం అవార్డ్స్ (Kalavedika NTR film awards) లో “బేబి” సినిమాకు రెండు పురస్కారాలు దక్కాయి. బెస్ట్ యాక్టర్ గా ఆనంద్ దేవరకొండ, బెస్ట్ డైరెక్టర్ గా సాయి రాజేష్ (Sai rajesh) ఈ అవార్డ్స్ గెల్చుకున్నారు. మురళీ మోహన్ చేతుల మీదుగా కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అందుకున్నారు ఆనంద్ దేవరకొండ, సాయి రాజేష్. ఈ సందర్భంగా సాయి రాజేశ్ మాట్లాడుతూ – “బేబి” సినిమా విడుదలై ఏడాది పూర్తయినా అవార్డ్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. మహాను‌భావుడు ఎన్టీఆర్ పేరు మీద పెట్టిన అవార్డ్స్ మా మూవీకి రావడం సంతోషంగా ఉంది. గొప్ప వాళ్ల చేతుల మీదుగా ఈ అవార్డ్స్ తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నాం. అన్నారు.