News June 30, 2024

ఖమ్మం రూరల్ పెద్ద తండాకు చెందిన బానోతు వీరన్న-జ్యోతి పెద్ద కుమారుడు బానోత్ అమిత్ రాథోడ్ ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించాడు. HYDలో ఇంటిగ్రేటెడ్ సివిల్స్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేసి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-పీజీ)ను ఇటీవల రాశాడు. ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా 35వ ర్యాంకు సాధించి సీటు పొందాడు. అమిత్ రాథోడ్‌ను పలువురు అభినందించారు.