News July 1, 2024

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 400కుపైగా పాయింట్లు లాభపడి 79,450 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 24,136 వద్ద కొనసాగుతోంది. ఐటీ స్టాక్స్ లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది. నిఫ్టీలో విప్రో, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, టీసీఎస్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి.