ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన కొవ్వలి రాజు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొద్దిరోజులుగా ఏలూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది అడారి చందు, శివ శంకర్, కూటమి నేతలు తొలి రోజున ఎలాగైనా రాజుకు నగదు అందివ్వాలని నిర్ణయించుకున్నారు. సొంత ఖర్చులతో ఏలూరులోని ఆసుపత్రికి వెళ్లి మరీ పెంచిన పెన్షన్ అందించారు. ఆయన ఆనందం వ్యక్తం చేశారు.