కడప అంగడి వీధికి చెందిన దూదేకుల మహబూబ్ చాంద్ (17) అనే విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐరన్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మృతురాలిది పెద్దమండెం మండలం పెద్దపసుపుల గ్రామం కాగా, అంగడి వీధిలోని తన చిన్నమ్మ వద్ద ఉంటూ కడపలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నట్లు ఆయన తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.