News July 1, 2024

భారత్, SA మధ్య జరిగిన టీ20 ఫైనల్ మ్యాచ్‌‌ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో 5.3 కోట్ల మంది వీక్షించినట్లు ఆ సంస్థ పేర్కొంది. కాగా గతేడాది IND, AUS మధ్య జరిగిన వన్డే WC ఫైనల్‌ను రికార్డు స్థాయిలో 5.9 కోట్ల మంది వీక్షించారు. మరోవైపు ఈ T20 ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. టీవీల్లో ఎంతమంది వీక్షించారనే గణాంకాలను BARC వారం రోజుల తర్వాత వెల్లడిస్తుంది.