News July 1, 2024

AP: నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఇవాళ్టి నుంచి స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. నూజివీడులో ఈ నెల ఆరో తేదీ వరకు పరిశీలన కొనసాగనుంది. సైనిక సంతతి కోటాలో 2,582, స్పోర్ట్స్ కోటాలో 1,830, దివ్యాంగుల కోటాలో 332, స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 270 మంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు వారికి కేటాయించిన తేదీల్లో ఉ.9 గంటలకే రిపోర్టు చేయాలి.