News July 1, 2024

AP: NTR భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఉదయం 6గంటల నుంచే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందించనున్నారు. పెరిగిన పింఛను, బకాయిలు కలిపి రూ.7వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, తీవ్ర వ్యాధులు కలిగిన వారికి రూ.15వేలను కూటమి ప్రభుత్వం అందించనుంది. మొత్తం 65.31 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. కాగా పెనుమాకలో CM చంద్రబాబు, గొల్లపల్లిలో పవన్ కళ్యాణ్ స్వయంగా పింఛన్లు అందిస్తారు.