News July 1, 2024

నిరుద్యోగుల ఆశను అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు ఆసరాగా తీసుకుని నట్టేట ముంచుతున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ HYDలో అన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలిప్పిస్తామని విదేశాలకు తీసుకెళ్లి.. సైబర్ నేరాలు చేయిస్తున్నారని, ఇటీవల కంబోడియాలో నిరుద్యోగ యువత వారి వలలో చిక్కుకున్నారని తెలిపారు. తాజాగా శ్రీలంకలోనూ సైబర్ నేరాలు చేస్తున్నారంటూ దాదాపు 137 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.