కల్కీ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడంతో టాలీవుడ్ మంచి జోష్లో ఉంది. ఈ సినిమా కలెక్షన్లు మేకర్స్కు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఇక్కడ తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన 2 సినిమాల షూటింగ్స్ నేడు షురూ అయ్యాయి. ‘యుఫోరియా’ అంటూ కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించాలని దర్శకుడు గుణశేఖర్ భావిస్తున్నారు. ‘శాకుంతలం’ సినిమా నిరాశపరచడంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన.. ‘యుఫోరియా’ను అనౌన్స్ చేశారు. ఈ మూవీ నేడు పూజా కార్యక్రమాలతో లాంచనంగా షురూ అయింది. నీలిమా గుణశేఖర్ ప్రొడ్యూసర్గా వ్యవహరించనున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించారు. ఈ మూవీతో మరోసారి తమ మార్క్ చూపించాలని గుణశేఖర్ ఉవ్విళ్లూరుతున్నారు.
ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం… ‘టైసన్ నాయుడు’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ పట్టాలపై ఉండగానే… #BSS11 సినిమాను అనౌన్స్ చేశారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాను కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. హారర్ మిస్టరీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసింది. ఇందులో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించనుంది. గతంలో ఈ జోడి రాక్షసుడు సినిమాలో మెప్పించిన విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.