లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తొమ్మిది మందితో కూడిన ప్యానెల్ స్పీకర్ల జాబితాను ప్రకటించారు. ఇందులో బాపట్ల టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఉన్నారు. ఆయనతో పాటు ఎంపీలు జగదంబికా పాల్, ఎ.రాజా, పి.సి. మోహన్, సంధ్యారాయ్, దిలీప్ సైకియా, శెల్జా, కాకోలీ ఘోష్ దస్తీదార్, అవధేశ్ ప్రసాద్‌లున్నారు. వీరంతా ప్యానెల్ స్పీకర్లుగా సభ నిర్వహణలో ఓం బిర్లాకు సహకరించనున్నారు.