News July 2, 2024

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన సీఈఓగా సీ.హెచ్. ఉమా మహేశ్వరరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును ఆయన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ప్రజలకు సెంట్రల్‌ బ్యాంక్‌ ద్వారా మెరుగైన సేవలు అందించాలని జెడ్పీ ఛైర్మన్ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.