News July 2, 2024

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సుదీర్ఘ విరామం తర్వాత పూర్తైంది. సంగారెడ్డి జిల్లాలో 915 మందికి పదోన్నతి దక్కగా.. 2267 మందికి స్థాన చలనం కలిగింది. సిద్దిపేట జిల్లాలోని మొత్తం 980 పాఠశాలల్లో 4136 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 622 మందికి పదోన్నతి, 1032 మంది బదిలీ అయ్యారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని DEOలు అన్నారు.