AP: కీలకమైన శాఖలు, ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. ఇప్పటికే పోలవరంపై సీఎం చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. 3వ తేదీన అమరావతిపై ఈ పత్రాన్ని సీఎం విడుదల చేయనున్నారు. గత ఐదేళ్లలో అమరావతి విధ్వంసం, తాజా పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణ అంశాలను ఇందులో పొందుపర్చనున్నారు. దీనిపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు పొందుపర్చాల్సిన అంశాలపై సూచనలు చేశారు.