News July 2, 2024

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా హౌరా(HWH), యశ్వంత్‌పూర్(YPR) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల సౌలభ్యం మేరకు కొద్దిరోజులు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.02863 HWH- YPR ట్రైన్‌ను జులై 4 నుంచి 25 వరకు ప్రతి గురువారం, నం.02864 YPR- HWH ట్రైన్‌ను జులై 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం నడుపుతామని తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని తెలిపింది.