News July 3, 2024

హింసను, విద్వేషాన్ని వ్యాపింపజేసే బీజేపీకి హిందూధర్మంలోని ప్రాథమిక సిద్ధాంతాలు తెలియడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గుజరాత్ కాంగ్రెస్ కార్యాలయంపై దాడిని పిరికిపంద చర్య పేర్కొన్నారు. ఈ హింసాత్మక దాడి బీజేపీ, సంఘ్ పరివార్‌పై తన అభిప్రాయాన్ని బలపరుస్తుందని Xలో పేర్కొన్నారు. గుజరాత్ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని, ఆ రాష్ట్రంలో INDIA కూటమి గెలుస్తుందని మరోసారి చెప్పారు.